Australia: ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్

  • లార్డ్స్ వేదికగా కీలక పోరు
  • ఆసీస్ జట్టులో రెండు మార్పులు
  • అదే జట్టుతో బరిలో దిగుతున్న ఇంగ్లాండ్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లీగ్ పోరులో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా, ఆసీస్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మార్ష్, జంపా స్థానంలో బెహ్రెన్ డార్ఫ్, నాథన్ లియాన్ జట్టులోకొచ్చారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆసీస్ సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే.

More Telugu News