ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షకు కమిటీ ఏర్పాటు
- కమిటీ కన్వీనర్ గా జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్
- ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు
- 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై సమీక్ష
టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు, 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై కమిటీ సమీక్ష చేయనుంది. అవసరమైతే రీటెండరింగ్ ను సూచించాలని, నలభై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలో ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బీ, ప్రాజెక్టు డిజైన్స్ రంగాలకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నట్టు సమాచారం.