Andhra Pradesh: తెలంగాణకు కేటాయించిన భవనాల్లోని సామగ్రిని అమరావతికి తరలిస్తున్న అధికారులు

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ భవనాలను ఏపీ పరిపాలన కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి కేంద్రంగా ఏపీ పరిపాలన సాగుతుండడంతో హైదరాబాద్ లోని ఆ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వాటిలోని అత్యధిక భవనాలను గవర్నర్ నరసింహన్ చొరవతో తెలంగాణకు కేటాయించారు. ఏపీ హోంశాఖకు, ఇతర ముఖ్య శాఖలకు రెండు భవనాలు ఇచ్చి మిగతావాటిని తెలంగాణకు కేటాయించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణకు కేటాయించిన భవనాల నుంచి సామగ్రిని అమరావతి తరలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలో ఉన్న విలువైన స్టేషనరీ, ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు ప్రత్యేక వాహనాల్లో అమరావతి పంపిస్తున్నారు. ఏపీ జీఏడీ అధికారుల పర్యవేక్షణలో ఈ తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh

More Telugu News