Andhra Pradesh: ఏపీలో విడుదల చేసే శ్వేతపత్రాలతో వాస్తవాలు బయటకొస్తాయి: సోము వీర్రాజు

  • ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు బయటకొస్తాయి
  • కేంద్ర నిధులను వినియోగించడంలో చంద్రబాబు విఫలం
  • ఇన్నాళ్లూ ఈ వివరాలు బయటకురాకుండా బాబు తొక్కిపెట్టారు
ఏపీలో కొత్త ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలతో వాస్తవాలు బయటకు రానున్నాయని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్లలో కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు ఈ శ్వేత పత్రాల ద్వారా బయటకొస్తాయని అన్నారు. ఇన్నాళ్లూ కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల గురించిన వాస్తవాలు బయటకు రాకుండా చంద్రబాబు తొక్కిపెట్టారని విమర్శించారు. శ్రీకాకుళం మినహాయించి, ప్రతి జిల్లాకు కేంద్ర సాయాన్ని, కేంద్ర నిధులను వినియోగించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.
Andhra Pradesh
bjp
somu veeraj
Telugudesam
Babu

More Telugu News