నాల్గో రౌండ్ లో కేఏ పాల్ కు 102 ఓట్లు!
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఇంతవరకూ పోలైన ఓట్ల సంఖ్య 102. నాల్గో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ పాల్ కు ఈ ఓట్లు పోలయ్యాయి. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. వైసీపీ తరపున రఘురామ కృష్ణంరాజు బరిలో నిలిచారు.