పారిస్ లోని భారత వాయుసేన 'రాఫెల్' కార్యాలయంలో చోరీకి యత్నం
- ఆఫీసులో ప్రవేశించేందుకు ప్రయత్నించిన దుండగులు
- భారత వాయుసేనకు సమాచారం అందించిన డసో సంస్థ
- ఘటనపై అనుమానాలు
పారిస్ నగర శివారు ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయంలో ప్రవేశించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించినట్టు రాఫెల్ తయారీ సంస్థ డసో ఏవియేషన్స్ భారత వాయుసేనకు సమాచారం అందించింది. రాఫెల్ ఒప్పందం అవినీతిమయం అంటూ భారత్ లో విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పత్రాలు లీకవడం ఇప్పటికే తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ పత్రాలు చోరీకి గురయ్యాయని చెప్పిన కేంద్రం ఆపై మాట మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పారిస్ లోని భారత వాయుసేన రాఫెల్ కార్యాలయంలో చోరీకి ప్రయత్నం జరగడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి.