Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

  • వ్యాను, ఆయిల్ ట్యాంకర్ ఢీ
  • ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది
  • మృతుల్లో చాలా మంది కార్మికులే

గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను, ఆయిల్‌ ట్యాంకర్‌‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు విధులు ముగించుకుని వడోదర జిల్లాలోని పాత్ర నుంచి బోర్సాద్‌లోని సరోల్ గ్రామానికి వెళ్తుండగా అంక్లావ్‌ ప్రాంతంలోని గంభీరా గ్రామం వద్ద  ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News