Andhra Pradesh: తమను పులివెందుల సబ్ జైలుకు మార్చాలని వివేకా హత్యకేసు నిందితుల విజ్ఞప్తి... అంగీకరించిన న్యాయస్థానం

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించారు. ఇవాళ పులివెందుల న్యాయస్థానంలో కేసు విచారణ రాగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు తెలిపారు. వివేకా హత్య వ్యవహారంలో సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిని పోలీసులు మరోసారి పులివెందుల కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ పొడిగించారు.

కాగా, ఈ ముగ్గురు తమను కడప నుంచి పులివెందుల సబ్ జైలుకు మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వారిని పులివెందుల సబ్ జైలుకు తరలించాలంటూ ఆదేశాలు జారీచేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP

More Telugu News