Elections: రెండు రాష్ట్రాల్లో ముగిసిన తుది విడత పోలింగ్

  • జార్ఖండ్ లో 3, బీహార్ లో 1 స్థానానికి ముగిసిన పోలింగ్
  • మిగతా 55 స్థానాల్లో సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది
  • ఈ నెల  23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ రెండు రాష్ట్రాల్లో ముగిసింది. జార్ఖండ్ లో 3 స్థానాలకు, బీహార్ లో 1 స్థానానికి పోలింగ్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలోని 55 స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 542 స్థానాలకు, ఏడు విడతలుగా ఈరోజు పోలింగ్ నిర్వహించారు. ఈ నెల  23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

More Telugu News