ఎన్నికల కమిషన్ కాదు.. బీజేపీ కమిషన్: బుద్ధా వెంకన్న
- తెల్ల కాగితంపై ఫిర్యాదు చేస్తే స్పందించింది
- దేశ చరిత్రలో తొలిసారి
- పీఎంవో ద్వారా ఈసీకి సిఫార్సు
పోలింగ్ జరిగిన 40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పీఎంవో ద్వారా వైసీపీ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయించిందన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ద్వివేదిలు రీపోలింగ్కు ఆదేశించారన్నారు. కుట్రలతో, డబ్బుతో ఆ ఐదు కేంద్రాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం రీపోలింగ్ ప్రకటన చేయడం సిగ్గుచేటని, తాము కోరిన 19 చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు.