Rohit Chowdary: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన రక్షణ శాఖ.. 2016కు ముందు మెరుపుదాడుల దాఖలాలు లేవని వెల్లడి

  • మెరుపు దాడుల సమాచారాన్ని కోరిన రోహిత్
  • 2018లో ఆర్టీఐకి దరఖాస్తు
  • కాంగ్రెస్ ప్రచారానికి విరుద్ధంగా సమాధానం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మెరుపు దాడుల విషయమై విమర్శ, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా రక్షణ శాఖ షాక్ ఇచ్చింది. 2004 నుంచి 2014 మధ్య కాలంలో మెరుపు దాడులకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ జమ్ముకశ్మీర్‌కి చెందని రోహిత్ చౌదరి ఆర్టీఐని ఆశ్రయించారు.

రోహిత్ 2018లో ఈ దరఖాస్తు చేయగా తాజాగా ఆర్టీఐ సమాచారం అందించింది. అయితే ఈ సమాచారం కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా వచ్చింది. తమ హయాంలో ఆరుసార్లు మెరుపు దాడులు చేశామని కాంగ్రెస్ చెబుతుండగా, 2016కు ముందు మెరుపు దాడులు జరిగినట్టు దాఖలాలేవీ లేవని రక్షిణ మంత్రిత్వ శాఖ రోహిత్‌కు వెల్లడించింది.
Rohit Chowdary
Jammu And Kashmir
RTI
Congress

More Telugu News