శ్రీకాకుళం జిల్లా వాసులకు భారీ నష్టాన్ని మిగిల్చిన ‘ఫణి’ తుపాన్
- వివిధ రూపాల్లో 38.5 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా
- విద్యుత్, వ్యవసాయ రంగాలకు అత్యధిక నష్టం
- దెబ్బతిన్న 162 ఇళ్లు
రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, తాగునీటి పైపులైన్లు ధ్వంసం కావడం వల్ల 2 కోట్ల 13 లక్షల 60 వేల రూపాయలు, పశు సంవర్థక శాఖకు 3.49 లక్షల నష్టం జరిగిందని తేల్చారు. ఇక, తుపాన్ సమయంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, వారికి అవసరమైన ఆహారం, మంచినీటి సరఫరా, ఇతరత్రా అవసరాల కోసం 31 లక్షల 89 వేలు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కతేల్చారు.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మొత్తం 3334 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా వారికోసం 338 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. 11.169 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 123.500 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు తరలించినట్లు పేర్కొన్నారు. మంచినీటి సరఫరాతోపాటు 312 వైద్య శిబిరాల ఏర్పాటుకు ఈ మొత్తం ఖర్చు చేసినట్లు తేల్చారు.