Andhra Pradesh: ‘ఫణి’ తుపాన్ పై కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన ఏపీ సీఎస్
‘ఫణి’ తుపాన్ పై కేంద్రానికి ప్రాథమిక నివేదికను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పంపారు. తుపాన్ వల్ల ఏపీలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. రెండు వేల విద్యుత్ స్తంభాలు, 117 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని 553 హెక్టార్లలో పంటలు, 520 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయని కేంద్రానికి పంపిన నివేదికలో సీఎస్ వివరించారు.