saodharam tej: నిజ జీవితంలో నా తల్లి పాత్ర గుర్తొచ్చింది: సాయిధరమ్ తేజ్

  • 'చిత్రలహరి' రెస్పాన్స్ ఆనందాన్నిస్తోంది
  •  ఈ విజయం నా ఒక్కడిదే కాదు
  • అందరం కలిసి కష్టపడ్డాం

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'చిత్రలహరి' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ లవ్ స్టోరీకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, "వరుస పరాజయాల తరువాత ఈ విజయం దక్కింది. దర్శకుడితో కలిసి నేను .. సునీల్ .. హైపర్ ఆది స్క్రిప్ట్ విషయంలో కసరత్తు చేశాము. రెస్పాన్స్ ను చూస్తుంటే మా ప్రయత్నం ఫలించిందని అనిపిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ వస్తుండటం ఆనందంగా వుంది .. ఈ విజయం నా ఒక్కడిదే కాదు .. అందరిది" అని అన్నాడు. "ఈ సినిమాలో పోసాని పోషించిన నా తండ్రి పాత్ర నాకెంతో ఇష్టం. ఈ పాత్ర అనుక్షణం నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ వుంటుంది. నిజ జీవితంలో ఈ పాత్ర నా తల్లిపాత్రకి దగ్గరగా అనిపించి మనసు భారమయ్యేది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News