India: మోదీని ఓడించడానికి ముస్లిం, క్రిస్టియన్ దేశాల కుట్ర.. కోట్లు పంపిస్తున్నారు!: బాబా రాందేవ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ముస్లిం, క్రైస్తవ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాందేవ్ మాట్లాడారు.

ప్రధాని మోదీ దేశ సంక్షేమం కోసం పాటుపడుతున్నారని రాందేవ్ వ్యాఖ్యానించారు. ‘దేశ అభివృద్ధి కోసం మోదీ 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్వప్రయోజనాల కోసం పని చేయలేదు. ఆయనకు కుటుంబం లేదు. సొంత ఇల్లు లేదు. అలాంటి మోదీకి మనమంతా మద్దతుగా నిలవాలి. ఆయన చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. ఆయన పాలనలోనే సైనికులు, మహిళలు, రైతులు అందరికి రక్షణ, భరోసా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
India
Rajasthan
Narendra Modi
BJP
baba ramdev
conspiracy
muslim and christian countries

More Telugu News