Chegondi Harirama Jogaiah: టీడీపీకి ఈ 'పీకే' లాభంకన్నా.. ఆ 'పీకే'తో నష్టమే ఎక్కువ: చేగొండి కీలక వ్యాఖ్యలు

  • పుసుపు - కుంకుమతో ఓట్లు రాలుతాయనుకోవడం అత్యాశే 
  • జనసేనతో టీడీపీకి కలిగే నష్టమే అధికం
  • ఏ పార్టీకీ 90 సీట్లు మించి రాబోవన్న జోగయ్య
ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తీసుకువచ్చిన 'పసుపు - కుంకుమ' పథకం ఓట్లను రాలుస్తుందని భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 'పసుపు - కుంకుమ' (పీకే)తో వస్తాయని భావించే ఓట్లతో పోలిస్తే, పవన్ కల్యాణ్ (పీకే) స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు.

 వైసీపీ గత ఎన్నికలతో పోలిస్తే, ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయిందని, మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని, ఆ మేరకు జగన్ ఎన్నో ఓట్లను నష్టపోయారని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ 90 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని, అధికార, విపక్ష పార్టీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుందని జోగయ్య వ్యాఖ్యానించారు.
Chegondi Harirama Jogaiah
PK
Pasupu Jumkuma
Pawan Kalyan
Chandrababu
Telugudesam
YSRCP
Jana Sena

More Telugu News