Narendra Modi: మోదీ నామినేషన్ సెంటిమెంట్.. ఇప్పుడు కూడా ర్యాలీ సంప్రదాయాన్ని కొనసాగించనున్న మోదీ!

  • 26న నామినేషన్ దాఖలు
  • 25న వారణాసిలో భారీ ర్యాలీ
  • గంగా హారతి కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 2014లో అనుసరించిన ర్యాలీ సంప్రదాయాన్నే ఆయన కొనసాగించనున్నారు. అప్పట్లో మోదీ నామినేషన్ వేయడానికి ముందు, గెలిచిన తరువాత ఆ నియోజకవర్గంలో మోదీ ర్యాలీలు నిర్వహించారు.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా మోదీ అదే విధంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ఏప్రిల్ 25నే వారణాసికి చేరుకుని, ఆ రోజున భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి దశశ్వమేథ్ ఘాట్ వరకూ ఈ ర్యాలీ కొనసాగనుంది. అనంతరం కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుని, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. నామినేషన్ వేసే రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకుని, మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు సమాచారం.  

More Telugu News