Andhra Pradesh: ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది: ద్వివేది

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో 80 శాతానికి చేరువలో పోలింగ్ నమోదు కావచ్చంటున్నారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఓటర్లు మళ్లీ సాయంత్రం పోలింగ్ కేంద్రాల వద్దకు రావడంతో తాకిడి పెరిగింది. ఈ కారణంగా 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరుగుతోంది. దీనిపై ద్వివేది స్పందిస్తూ, ఓటర్ల సంఖ్యను బట్టి అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. నిర్దేశిత సమయం తర్వాత క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh

More Telugu News