Medak District: చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్ దంపతులు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని చింతమడకకు ఈరోజు ఉదయం కేసీఆర్, ఆయన భార్య శోభ చేరుకున్నారు. చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు వేశారు. కాగా, కేసీఆర్ వెంట మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఉన్నారు.