Telugudesam: లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఈసీ అభ్యంతరం

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేస్తాయంటూ ఇటీవల కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలపై ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైనే కాకుండా కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమసింహం', ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథతో రూపొందిన 'పీఎం మోదీ' చిత్రాల విడుదలకు కూడా ఈసీ నో చెప్పింది. ఈ మూడు సినిమాలను ఎన్నికల సమయంలో రిలీజ్ చేయవద్దంటూ గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి.
Go Back to Shorts
Telugudesam
BJP
TRS
KCR
Chandrababu
Narendra Modi

More Telugu News