వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ కొత్త టెక్నిక్లు: శరద్ పవార్
- టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది కాంగ్రెస్సే
- రాజీవ్ గాంధీ వల్లే నేడు అందరూ మొబైల్స్ వాడుతున్నారు
- డీమోనిటైజేషన్ వల్ల 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు
అమరుడయ్యే ప్రతీ భారత జవానుకు ప్రతిగా పదిమంది పాకిస్థాన్ జవాన్లను హతమారుస్తామని డాంబికాలు పలికిన మోదీ ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారని దుయ్యబట్టారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ జవాన్లు యథేచ్ఛగా కాల్పులు జరుపుతున్నారని, ఈ కాల్పుల్లో 693 మంది సైనికులు అమరులయ్యారని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కారణంగా మహారాష్ట్రలో 100 మంది ఏటీఎంల వద్ద క్యూల్లో నిల్చుని చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీమోనిటైజేషన్ వల్ల 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చేసిన హామీని మోదీ తుంగలో తొక్కారని శరద్ పవార్ మండిపడ్డారు.