Vijay Sai Reddy: చంద్రబాబు అసలు బాధ ఇదే: విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు ఓటమిని అంగీకరించినట్టే
  • వ్యవస్థలన్నీ అడ్డం తిరుగుతున్నాయన్నదే బాధ
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
నిన్న మొన్నటి వరకూ తాను మేనేజ్ చేసిన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా తనకు అడ్డం తిరుగుతున్నాయన్నదే చంద్రబాబు అసలు బాధని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఈసీ మీద యుద్ధం ప్రకటించడమంటే చంద్రబాబు ఓటమిని ముందే అంగీకరించినట్టు. ఏబీ వెంకటేశ్వర్రావును తప్పించినప్పటి నుంచి తనపై అంతా కుట్రలు పన్నుతున్నారని విలపిస్తున్నాడు. నిన్నటి వరకు తను మ్యానేజ్ చేసిన వ్యవస్థలన్నీ తనకే అడ్డం తిరిగాయనేది అసలు బాధ" అని అన్నారు.



Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News