KCR: దోచుకున్నది దాచుకోవడానికే 16 మంది ఎంపీల నినాదం: కేసీఆర్‌పై మల్‌రెడ్డి ఫైర్

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల 16 మంది ఎంపీలను గెలిపించాలనే నినాదాన్ని చేపట్టింది దోచుకున్నది దాచుకోవడానికేనని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 16 మంది ఎంపీలతో ఈ ఐదేళ్లూ కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలని మల్‌రెడ్డి నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
KCR
KTR
Malreddy
TRS
Congress

More Telugu News