jagan: వైసీపీ గెలిస్తే ఏపీ ఎడారిగా మారుతుంది: కనకమేడల

షార్ట్స్‌లో చూడండి
స్వార్థ రాజకీయాల కోసం టీఆర్ఎస్ తో చేతులు కలిపి... ఏపీని ఎడారిగా మార్చేందుకు వైసీపీ నేత జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను మూసేయాలని ఓ వైపు టీఆర్ఎస్ చెబుతోందని... ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాయలసీమలోని పంట పొలాలను బీళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం పిటిషన్లు వేస్తోందని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని కోరుతోందని చెప్పారు. అలాంటి పార్టీతో అంటకాగుతున్న జగన్... రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
Go Back to Shorts
jagan
ysrcp
kanakamedala
Telugudesam

More Telugu News