Andhra Pradesh: జగన్ ను చూస్తుంటే జాలి వేస్తోంది !: ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు

  • చంద్రబాబు వల్లే అనంతలో కియా వచ్చింది
  • మోదీ ఇందుకోసం లేఖ రాయలేదు
  • మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోనే అనంతపురం జిల్లాలో ‘కియా కార్ల పరిశ్రమ’ ఏర్పాటు అయిందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏనాడైనా ఏపీలో పరిశ్రమను ఏర్పాటు చేయాలని కియా కంపెనీకి లేఖలు రాశారా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు.

అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ టీడీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ ను చూస్తే తనకు జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ ఓ చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరుగుతున్నా, ఆ ఫ్యాన్ మాత్రం తిరగదని ఎద్దేవా చేశారు.

జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద, రెగ్యులేటర్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే.
Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Chandrababu
Nara Lokesh
Guntur District
mangalagiri

More Telugu News