కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ విద్వేషాలను రెచ్చగొడుతోంది!: ఏపీ సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీతోనే సాధ్యమని నమ్ముతున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతీ నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, రోజువారీ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని టీడీపీ శ్రేణులకు బాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

తుది ఓటర్ల జాబితా విడుదల అయిందనీ, అందరూ తనిఖీ చేసుకోవాలని ఏపీ సీఎం సూచించారు. పోలింగ్ బూత్ ల వారీగా పార్టీ విజయం కోసం కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీలో దొంగ ఓట్ల ఎత్తులను చిత్తు చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలన్నారు. సమాజంలో అన్ని కులాలు, మతాలను టీడీపీ గౌరవిస్తోందని చంద్రబాబు తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే బాగా పనిచేసినవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan

More Telugu News