అదే జరిగితే ఇండియాకు, జమ్ముకశ్మీర్ కు మధ్య బంధం ముగిసినట్టే: మెహబూబా ముఫ్తీ
- ఆర్టికల్ 370ని తొలగిస్తే బంధం ముగిసినట్టే
- సంబంధాలపై మళ్లీ చర్చించుకోవాల్సి ఉంటుంది
- ఇండియాతో జమ్ముకశ్మీర్ కలసి ఉండాలని మీరు అనుకుంటున్నారా?
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. జమ్ముకశ్మీర్ లో ఇతర ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయకుండా ఈ ఆర్టికల్స్ అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, వీటికి సంబంధించి మార్పులు చేయడమో లేక పూర్తిగా తొలగించడమో చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, మెహబూబా ముఫ్తీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.