Narendra Modi: ఇది భారత్ 'మిషన్ శక్తి'... యాంటీ-శాటిలైట్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది: నరేంద్ర మోదీ కీలక ప్రకటన

  • లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని లైవ్ శాటిలైట్ కూల్చివేత
  • యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా ప్రయోగం
  • అమెరికా, రష్యా, చైనాల సరసన ఇండియా

ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను మన శాస్త్రవేత్తలు యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా కూల్చివేశారని, ఈ ప్రయోగం విజయవంతమైందని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని, ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.

లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశారని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇకపై ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.





More Telugu News