పెళ్లి రోజు చిరిగిన కొత్త దుస్తులు... రూ. 75 వేలు ఫైన్!
- తమిళనాడులో ఘటన
- రూ. 11 వేలు పెట్టి డ్రస్ కొనుగోలు చేసిన సుబ్రమణి
- చిరిగిపోవడంతో పరువు పోయిందని ఫిర్యాదు
వివాహానికి ముందు పురుసవాక్కంలోని ఓ జౌళి దుకాణంలో సుబ్రమణి రూ. 11 వేలు పెట్టి కొత్త బట్టలు కొన్నాడు. పెళ్లి రోజున అవి చిరిగిపోవడంతో, మామూలు దుస్తులు వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. చిరిగిన దుస్తులతో తన పరువు పోయిందని, దీనికి నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తూ, వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. దీనిని విచారించిన న్యాయమూర్తి లక్ష్మీకాంతం సుబ్రమణికి రూ. 75 వేల నష్టపరిహారాన్ని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5 వేలను ఇవ్వాలని తీర్పిచ్చారు.