Telangana: టీఆర్ఎస్ లోకి సునీతా లక్ష్మారెడ్డి?

  • ఇప్పటికే సీఎం కేసీఆర్, కేటీఆర్ ను కలిసిన సునీత
  • నర్సాపూర్ సభలో పార్టీ కండువా కప్పుకోనున్న వైనం
  • బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు చెక్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ తో  ఆమె ఇప్పటికే సమావేశమయ్యారు. వచ్చే నెల 3న నర్సాపూర్ లో టీఆర్ఎస్ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, ‘కాంగ్రెస్’ను ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు వీడారు. కొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరగా, మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. సునీతా లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది.  

More Telugu News