YSRCP: ప్రజలను ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కల్యాణ్ గారూ?: విజయసాయి రెడ్డి

  • గత ఎన్నికల్లో ఓట్లు చీలతాయని పోటీ చేయలేదన్నారు
  • ఇప్పుడు, మీ యజమాని చెప్పినట్టు పోటీ చేస్తున్నారు
  • ఓట్లు చీల్చాలని అనుకుంటున్నారు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు, ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో ఓట్లు చీలతాయన్న కారణం చెప్పి పోటీలో నిలబడలేదని పవన్ చెప్పారని గుర్తుచేశారు, ఈసారి తమ యజమాని చెప్పినట్టు పోటీ చేసి ఓట్లు చీల్చాలని అనుకుంటున్నారంటూ పరోక్షంగా టీడీపీ-జనసేన పార్టీ ఒకటేనన్న ఆరోపణలు చేశారు. ప్రజలను ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కల్యాణ్ గారూ? అని తన ట్వీట్ లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
YSRCP
vijayasai reddy
Telugudesam
janasena
pawan

More Telugu News