Jagan: జగన్‌కు చదువు రాదు కాబట్టే పీకేపై ఆధారపడ్డారు: నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • పీకే రాజకీయ నాయకుడు కాదు
  • డేటాను విదేశీయుల చేతుల్లో పెడుతున్నారు
  • డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్
  • పీకేను నమ్మటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు
వైసీపీ అధినేత జగన్ చదువుకోలేదు కాబట్టే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై ఆధారపడ్డారని నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే రాజకీయ నాయకుడు కాదని, సౌత్ ఇండియాకు ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదన్నారు. అన్ని సర్వేలను తప్పని చెప్పలేం కానీ, చాలా వరకూ సర్వేలు వ్యాపారంగా మారిపోయాయన్నారు.

ప్రజల డేటాను తీసుకెళ్లి పీకే విదేశీయుల చేతుల్లో పెడుతున్నారని, డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్ అని శివాజీ విమర్శించారు. పీకేని వ్యాహకర్తగా అభివర్ణించడం పెద్ద తప్పని, ఆయన్ను నమ్ముకోవడం జగన్ చేసిన అతి పెద్ద తప్పన్నారు. వైసీపీపై బీజేపీ, టీఆర్ఎస్ పెత్తనం చేస్తున్నాయని శివాజీ విమర్శించారు. సర్వేల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్‌ను గెలిపించి ఏపీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ, కేసీఆర్ భావిస్తున్నారని శివాజీ ఆరోపించారు.
Jagan
Prashanth Kishore
Shivaji
YSRCP
South India
BJP
TRS
KCR
Narendra Modi

More Telugu News