sensex: కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 71 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 35 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతం పైగా పెరిగిన బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్
దేశీయ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. రూపాయి విలువ పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 71 పాయింట్లు పెరిగి 38,095కు ఎగబాకింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 11,462 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.84%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.29%), యాక్సిస్ బ్యాంక్ (2.21%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.89%), టాటా స్టీల్ (1.77%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.56%), హీరో మోటో కార్ప్ (-2.47%), భారతి ఎయిర్ టెల్ (-2.08%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%), ఎల్ అండ్ టీ (-1.32%).         
sensex
nifty
stock market

More Telugu News