Stock Market: నేడు కూడా లాభాలలోనే స్టాక్ మార్కెట్లు!

  • 216 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 
  • 40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 
  • బ్యాంకింగ్ రంగం షేర్లలో ర్యాలీ

నేడు వరుసగా మూడో రోజు కూడా మన స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. మార్కెట్లు ఉదయం కాస్త ఊగిసలాటలో ప్రారంభమైనప్పటికీ, తర్వాత బ్లూచిప్ కంపెనీల షేర్లు కొనడానికి మదుపరులు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఊపందుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రధాన షేర్లలో ర్యాలీ కొనసాగడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

దీంతో సెన్సెక్స్ 216 పాయింట్లు పెరిగి 37752 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 11342 వద్ద ముగిశాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, రిలయన్స్ తదితర షేర్లు లాభపడగా.. భారతీ ఎయిర్ టెల్, వేదాంత, ఐఓసి, సన్ ఫార్మా, టాటా స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.   

More Telugu News