Telugudesam: జగన్, సాక్షి పత్రికపై ఈసీకి ఫిర్యాదు చేసిన దివ్యవాణి

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలు ప్రకటించడంతో రాజకీయ పక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కు సంబంధించిన సాక్షి పత్రికను వీధుల్లో, పార్కుల్లో ఉచితంగా పంచుతున్నారంటూ టీడీపీ మండిపడుతోంది.

ఈ మేరకు రూ.60 లక్షల ఖర్చును జగన్ ఖాతాలో రాయాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లంతో వ్యాసం రాయించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాంటూ దివ్యవాణి ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఈసీని కోరారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసిన సమయంలో దివ్యవాణి వెంట బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య కూడా ఉన్నారు.
Go Back to Shorts
Telugudesam
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News