India: సీఆర్పీఎఫ్ అమర జవాన్లకు క్రికెటర్ల నివాళి.. ఆర్మీ టోపీలతో మైదానంలోకి భారత ఆటగాళ్లు!

  • టోపీలను అందజేసిన ధోని
  • నేడు రాంచీలో మూడో వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత జట్టు మైదానంలోకి దిగనుంది.

ఈరోజు ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు. ఈరోజు మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
India
Cricket
crpf
40 dead
camoflauge
caps
MS Dhoni
Australia
tribute

More Telugu News