టీడీపీకి జయసుధ గుడ్ బై.. నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక!
- ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జగన్ ఇంటికి
- వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే
- జయసుధ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్
దీంతో ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు జగన్ కు తెలపగా, ‘మన పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిద్దాం’ అని వైసీపీ అధినేత చెప్పారు. దీంతో వైసీపీలో జయసుధ చేరికకు మార్గం సుగమం అయింది. కాగా, ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జయసుధ జగన్ నివాసానికి చేరుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరుతారని పేర్కొన్నాయి. జయసుధ గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు.