Andhra Pradesh: డేటా చోరీ వివాదం.. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టనున్న టీడీపీ?

  • తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ టీడీపీ నేతల ఆగ్రహం
  • డేటాను టీ-సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టే యోచన
  • పరువు నష్టం దావా కూడా వేస్తుందని సమాచారం
డేటా చోరీ కేసు వివాదంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టే యోచనలో ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసు పెట్టే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటాను తెలంగాణ సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టాలని, పరువు నష్టం దావా వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Andhra Pradesh
Telangana
kcr
Chandrababu

More Telugu News