ఇది దేశంలోనే అతి పెద్ద సైబర్ విద్రోహ చర్య.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి!
- రహస్య సమాచారాన్ని బజారున పడేశారు
- ఈ సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కవచ్చు
- ట్విట్టర్ లో ఏపీ సీఎంపై దుమ్మెత్తిపోసిన నేత
విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చంద్రబాబు డేటా చోరీ స్కాం దేశంలోనే పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమ్. రహస్య సమాచారాన్ని బజారులో పడేశారు. ఇంకా ఏయే వ్యవస్థల్లోకి చొరబడ్డారో తేల్చాలి. దొంగిలించిన సమాచారంతో ఏపీ ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కుప్పకూల్చాడు’ అని ట్వీట్ చేశారు.