ప్రతిపక్షం నన్ను అంతం చేయాలని చూస్తోంది: మోదీ
- ప్రజా సంకల్ప్ ర్యాలీలో మోదీ నిప్పులు
- పాకిస్థాన్కు లబ్ధి చేకూరేలా ప్రతిపక్షాల ప్రవర్తన ఉందన్న ప్రధాని
- బీహార్ను నితీశ్ చీకటి రోజుల నుంచి బయటపడేశారంటూ ప్రశంసలు
పేదల సంక్షేమం పేరిట రాజకీయ దుకాణాలు నడుపుకుంటూ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం తప్ప ఇంకేమీ చేయని కొందరు నాయకులకు కాపలాదారులతో సమస్యేనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ను ఉద్దేశించి విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్లు కలిసి బీహార్ను చీకటి రోజుల నుంచి బయటపడేశారని, వారికి అభినందనలు తెలుపుతున్నట్టు మోదీ పేర్కొన్నారు.