Odisha: ఒడిశాలో పోలీస్ వ్యాన్ ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు అధికారుల దుర్మరణం

  • ఒడిశాలోని జార్షుగూడా జిల్లాలో ఘటన
  • సీఎం కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం
  • మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల పరిహారం
ఒడిశాలోని జార్షుగూడా జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ బహిరంగ సభకు భద్రత కోసం వెళుతున్న పోలీస్ వ్యాన్ ను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడికక్కడే చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మిగిలిన అధికారులు తమ సహచరులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.

కాగా, ఈ ప్రమాదంపై నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోలీసులకు రూ.లక్ష పరిహారం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.
Odisha
Road Accident
two police dead
17 injured
lorry
naveen patnayak

More Telugu News