పాక్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసిన రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ వ్యాఖ్య
- సంయమనం లేకుండా చేస్తున్న ప్రకటనలతో అభాసుపాలు
- దీటుగా బదులివ్వడంతో వెనక్కి వెళ్లిపోయాయన్న ఆసిఫ్
- చీకటిగా ఉండటంతో స్పందించలేకపోయామన్న పర్వేజ్
నేటి ఉదయం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చి దాడులకు యత్నించగా.. తాము దీటుగా బదులివ్వడంతో వెనక్కి వెళ్లిపోయాయని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మధ్యాహ్నానికి మాట మార్చిన పాక్... అసలు వైమానిక దాడులే జరగలేదని.. ఎలాంటి నష్టం తమకు వాటిల్లలేదని పేర్కొంది.
మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సరైన సమయం చూసి దెబ్బకొడతామంటూ పేర్కొన్నారు. ఇక తాజాగా రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ మాట్లాడుతూ.. ‘భారత్ను తిప్పి కొట్టేందుకు పాక్ వైమానిక దళం సిద్ధంగానే ఉందని.. కానీ రాత్రివేళ చీకటిగా ఉండటంతో స్పందించలేకపోయిందని పేర్కొన్నారు. ఈ పొంతనలేని వ్యాఖ్యలతో పాక్ అభాసుపాలవుతోంది.