Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది: నారా లోకేశ్

  • నేను పోటీ చేసేది లేనిది  అధిష్ఠానం నిర్ణయిస్తుంది
  • జగన్ ను దూషించిన వారే ఆ పార్టీలో చేరారు
  • ఇలా చేరడం విచిత్రంగా ఉంది
వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేయాలని ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కృష్ణా జిల్లా నందిగామలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నేను పోటీ చేయాలా? వద్దా?’ అనేది తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీని వీడిన ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ లను దృష్టిలో పెట్టుకుని ఆయన విమర్శలు చేశారు. జగన్ ను దూషించిన వారే ఆ పార్టీలో చేరడం విచిత్రంగా ఉందని అన్నారు.  
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
Chandrababu

More Telugu News