Andhra Pradesh: ఎన్నికలకు ముప్పై రోజుల ముందు పొత్తులపై నిర్ణయం: మంత్రి నారా లోకేశ్

  • వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలుస్తాం
  • టికెట్ రాని వాళ్లే తమ పార్టీని వీడుతున్నారు
  • అందరి పనితీరు చంద్రబాబు దగ్గర ఉంది
ఎన్నికలకు ముప్పై రోజుల ముందు పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలుస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. టికెట్ రాని వాళ్లే తమ పార్టీని వీడుతున్నారని అన్నారు. అందరి పనితీరు చంద్రబాబు దగ్గర ఉందని, వచ్చే ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులకే టీడీపీ టికెట్లు ఇస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. జగన్ పార్టీని ఒక డ్రామా కంపెనీగా ఆయన అభివర్ణించారు.
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
elections
YSRCP
jagan

More Telugu News