ఓటుకు నోటు కేసు విచారణ.. అధికారులు అడిగిన డాక్యుమెంట్లన్నీ అందజేశా: వేం నరేందర్ రెడ్డి
- అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పా
- ఈ కేసుతో నా కుమారులకు సంబంధం లేదు
- విచారణకు నా కుమారులను ఈడీ పిలవడం బాధాకరం
ఈ కేసుతో సంబంధం లేని తన కుమారులను ఈడీ పిలవడం బాధాకరమని, ఈడీ అధికారులు తమను వేర్వేరుగా విచారించినట్టు చెప్పారు. రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్నది న్యాయస్థానాలు తేలుస్తాయని అన్నారు. ఈ కేసు వ్యవహారం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కేంద్రానికి అప్పగించినట్టు అనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని, వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించారని అన్నారు.