modi: నన్ను తిట్టడానికి పెద్ద విమానం వేసుకుని వచ్చారు: మోదీపై చంద్రబాబు ధ్వజం

  • పుండుపై మోదీ కారం చల్లుతున్నారు
  • దారుణాలు సహించలేకే ఆంధ్రులు నిరసన చేస్తున్నారు
  • రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోగా.. నన్నే విమర్శిస్తున్నారు

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం తనను తిట్టడం కోసం ఢిల్లీ నుంచి పెద్ద విమానం వేసుకుని వచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీకి మోదీ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారని గతంలో కాంగ్రెస్ ను మోదీ విమర్శించారని... ఇప్పుడు బీజేపీ కూడా తల్లికి అన్యాయమే చేసిందని చెప్పారు. మోదీ రాకపై నిరసన తెలపాలనే తాను నల్ల చొక్కా ధరించానని తెలిపారు. విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎదుటి వ్యక్తిని తిట్టడం చాలా సులువని... పని చేయడం కష్టమని చంద్రబాబు అన్నారు. విభజన కారణంగా అయిన పుండుపై మోదీ కారం చల్లుతున్నారని మండిపడ్డారు. మీరు చేసిన దారుణం సహించలేకే ఆంధ్రులంతా రోడ్డెక్కి నిరసన చేస్తున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా ఫలితం దక్కలేదని అన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోగా తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News