unlimited food: ఎల్బీ నగర్ మెట్రోలో రూ.100కి తిన్నంత భోజనం.. రూ.50కే టిఫిన్!

  • ఎల్బీ నగర్  మెట్రో స్టేషన్ లో అయ్యంగార్ క్యాంటీన్
  • ప్రారంభించిన మెట్రో అధికారి అనిల్
  • టిఫిన్ లో ఇడ్లి, దోశ, పొంగల్
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో ప్రారంభమైన 'అయ్యంగార్ ఇడ్లీ దోశ క్యాంటీన్' బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.50 చెల్లిస్తే ఇష్టం వచ్చినన్ని ఇడ్లీలు, దోశలు, పొంగల్ ను టిఫిన్ గా తినొచ్చని తెలిపింది. అలాగే రూ.100 చెల్లిస్తే అన్ లిమిటెడ్ భోజనం తినొచ్చని వెల్లడించింది. ఈ క్యాంటీన్ ను మెట్రో రైలు అధికారి అనిల్ కుమార్ షైని ఈరోజు ప్రారంభించారు. కాగా, మెట్రో క్యాంటీన్ లో భోజనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు.

More Telugu News

unlimited food
tiffin
Hyderabad
metro lingamplly
ayyamgar can teen