sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 358 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 128 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతం పైగా లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్, టాటీ స్టీల్
దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మెటల్స్, ఐటీ సూచీలు ముఖ్యంగా బాగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 36,975కు పెరిగింది. నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 11,062 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్ లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి.
sensex
nifty
stock market

More Telugu News