ప్రతి వర్గానికి మేలు కలగాలన్నదే మా ఆశయం: పీయూష్ గోయల్
- దేశ సమగ్ర వికాసమే ప్రధాని మోదీ లక్ష్యం
- రైతులకు గొప్ప ఊరట కిసాన్ సమ్మాన్ నిధి పథకం
- ఈ పథకంతో 12.5 కోట్ల మంది రైతులకు మేలు కలుగుతుంది
రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఇంత వరకూ ఎవరూ తీసుకోలేదని, ఈ పథకం ద్వారా 12.5 కోట్ల మంది రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018 డిసెంబర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ అందించే పథకం కూడా చాలా గొప్పదని, దీని ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్ అన్నారు.