వైఎస్ జగన్ తో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా సమావేశం!
- వైసీపీ అధినేత ఇంటికి యూఎస్ కాన్సుల్ జనరల్
- మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు
- త్వరలో ప్రారంభం కానున్న సమరశంఖారావం
అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా ఈరోజు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ లోని జగన్ నివాసానికి వచ్చిన ఆమె పలు విషయాలపై చర్చించారు. ఈరోజు మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు.